గుంటూరు జిల్లాలో దారుణం..మహిళ హత్య
ABN , First Publish Date - 2020-05-09T14:34:11+05:30 IST
జిల్లాలోని వట్టిచెరుకూరు మండలం 5వ మైలు దగ్గర దారుణ ఘటన చోటుచేసుకుంది. దుండగులు ఓ మహిళను దారుణంగా హత్య చేశారు.
గుంటూరు: జిల్లాలోని వట్టిచెరుకూరు మండలం 5వ మైలు దగ్గర దారుణ ఘటన చోటుచేసుకుంది. దుండగులు ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. మృతురాలు ఏటుకూరుకు చెందిన శ్రీలక్ష్మిగా గుర్తించారు. పొలంలో శ్రీలక్ష్మి మృతదేహం పక్కనే అపస్మారకస్థితిలో యువకుడు కూడా పడివున్నాడు. ఆ యువకుడు కొండెపాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించి ఆసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.