రేపు గుంటూరుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి
ABN , First Publish Date - 2020-12-20T13:21:07+05:30 IST
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు సోమవారం తన స్వస్థలమైన పెదనందిపాడు మండలంలోని నాగుపాలడు గ్రామానికి రానున్నట్లు తెలుస్తోంది.

గుంటూరు: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు సోమవారం తన స్వస్థలమైన పెదనందిపాడు మండలంలోని నాగుపాలడు గ్రామానికి రానున్నట్లు తెలుస్తోంది. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం గుంటూరుకు చేరుకొంటారు.