ఆస్తి కోసం తల్లిని చంపిన కొడుకు
ABN , First Publish Date - 2020-09-12T14:32:57+05:30 IST
జిల్లాలోని రొంపిచెర్ల మండలం అన్నవరంలో దారుణం చోటు చేసుకుంది.

గుంటూరు: జిల్లాలోని రొంపిచెర్ల మండలం అన్నవరంలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్న తల్లినే పొట్టనబెట్టుకున్నాడు కసాయి కొడుకు. నిద్రిస్తున్న తల్లిపై గత అర్ధరాత్రి కొడుకు దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన తల్లి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.