గుంటూరు: వైసీపీ ఆధిపత్య పోరులో గాయపడ్డ వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2020-07-01T14:30:20+05:30 IST
గుంటూరు: వైసీపీ ఆధిపత్య పోరులో గాయపడ్డ వ్యక్తి మృతి
గుంటూరు: జిల్లాలో రాజుపాలెం మండలం బలిజేపల్లికి చెందిన గుడారి సుబ్బారావు మృతి చెందాడు. వైకాపాలో ఆధిపత్య పోరులో భాగంగా నాలుగు రోజుల క్రితం సుబ్బారావుపై ప్రత్యర్థులు మారణాయుదాలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సుబ్బారావును జీజీహెచ్కు తరలించగా...చికిత్స పొందుతూ మృతి చెందాడు. నేడు స్వగ్రామానికి మృతదేహాన్ని తరలించనున్నారు. అయితే అంత్యక్రియల సందర్భంగా మరోసారి దాడులు జరిగే అవకాశం ఉండటంతో గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.