మత్స్యకారులను పంపిస్తాం
ABN , First Publish Date - 2020-04-24T08:28:00+05:30 IST
గుజరాత్లోని వీరావల్లో చిక్కుకుపోయిన ఉత్తరాంధ్ర మత్స్యకారులను తిరిగి స్వస్థలానికి పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గుజరాత్ గవర్నర్ ఆచార్య...
![మత్స్యకారులను పంపిస్తాం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
- వెంకయ్యకు గుజరాత్ సీఎం, గవర్నర్ భరోసా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): గుజరాత్లోని వీరావల్లో చిక్కుకుపోయిన ఉత్తరాంధ్ర మత్స్యకారులను తిరిగి స్వస్థలానికి పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి విజయ్రూపానీ గురువారం ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుకు భరోసా ఇచ్చా రు. గుజరాత్లో చిక్కుకున్న ఉత్తరాంధ్ర మత్స్యకారుల సమస్యపై గుజరాత్ గవర్నర్, సీఎంలతో గురువారం మాట్లాడినప్పుడు వారు పైవిధంగా స్పందించారు.