గ్రూప్-1కి 81.46% హాజరు
ABN , First Publish Date - 2020-12-20T09:07:32+05:30 IST
గ్రూప్-1 మెయిన్స్లో శనివారం నిర్వహించిన పేపర్-4 పరీక్షకు ఏపీ, తెలంగాణల్లో కలిపి 81.46ు మంది హాజరయ్యారు. మొత్తం 6,834 మంది పరీక్ష రాశారు

అమరావతి, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 మెయిన్స్లో శనివారం నిర్వహించిన పేపర్-4 పరీక్షకు ఏపీ, తెలంగాణల్లో కలిపి 81.46ు మంది హాజరయ్యారు. మొత్తం 6,834 మంది పరీక్ష రాశారు. ఏపీ, హైదరాబాద్లో కలిపి 41 సెంటర్లలో పరీక్ష నిర్వహించారు. పరీక్షలు సాఫీగా జరిగినట్లు ఏపీపీఎస్సీ సెక్రెటరీ ఆంజనేయులు తెలిపారు.