ఇతర రాష్ట్రాల స్థాయిలో ప్యాకేజీ ఇవ్వాలి: కళా
ABN , First Publish Date - 2020-03-29T08:46:45+05:30 IST
‘‘ప్రజలు రోడ్ల మీదకి రాకుండా కట్టడి చేసేందుకు నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలి. కేంద్రం రూ.1.70 లక్షల కోట్లతో...
అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రజలు రోడ్ల మీదకి రాకుండా కట్టడి చేసేందుకు నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలి. కేంద్రం రూ.1.70 లక్షల కోట్లతో ప్యాకేజీ ప్రకటిస్తే... ఇతర రాష్ట్రాలూ భారీగానే ప్యాకేజీలు ప్రకటించాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలి’’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. శనివారం ఆ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. కేరళలో ప్రకటించినట్లుగా రూ.5 వేల కోట్లతో హెల్త్ ప్యాకేజీని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులలో కరోనా వైద్య చికిత్సలు అందించాలన్నారు. లాక్డౌన్ కాలంలో ప్రతి కుటుంబానికీ రూ.5 వేల నగదు సాయం అందించాలన్నారు. వివిధ వర్గాల ప్రజలను ఆదుకోవడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.