రైతు కన్నీరు పెడుతుంటే... రాజకీయాలా?: లోకేశ్
ABN , First Publish Date - 2020-04-12T07:09:08+05:30 IST
‘‘ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతన్న సర్వం కోల్పోయి పొలంలో కన్నీరు పెడుతున్నాడు. సీఎం జగన్మోహన్రెడ్డి మాత్రం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి...

అమరావతి, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): ‘‘ఆరుగాలం శ్రమించి దేశానికి అన్నం పెట్టే రైతన్న సర్వం కోల్పోయి పొలంలో కన్నీరు పెడుతున్నాడు. సీఎం జగన్మోహన్రెడ్డి మాత్రం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి రైతాంగాన్ని ఆదుకోవాలని లోకేశ్ శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.