ఆ భూమితో మాకు ఎలాంటి సంబంధం లేదు: మాజీ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-12-20T18:16:46+05:30 IST

ఆ భూమితో మాకు ఎలాంటి సంబంధం లేదు: మాజీ ఎమ్మెల్యే

ఆ భూమితో మాకు ఎలాంటి సంబంధం లేదు: మాజీ ఎమ్మెల్యే

విశాఖ: ఆనందపురం మండలం భీమన్న దొరపాలెంలో రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సర్వే నెంబర్ 150లో సుమారు 60 ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మాజీ టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ భూమి అంటూ ప్రచారం జరిగింది. అయితే ఆ భూమిపై మాజీ ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ స్పందించారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని  ఆయన పేర్కొన్నారు. తమ కుటుంబానికి, భూమికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.


Updated Date - 2020-12-20T18:16:46+05:30 IST