ప్రజల హక్కులను కాపాడండి: గవర్నర్‌కు చంద్రబాబు లేఖ

ABN , First Publish Date - 2020-07-18T20:01:35+05:30 IST

వేధింపులు, చట్టవిరుద్ధమైన అరెస్టులు జరుగుతున్నాయంటూ గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్‌కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ‘‘పోలీసు

ప్రజల హక్కులను కాపాడండి: గవర్నర్‌కు చంద్రబాబు లేఖ

అమరావతి: వేధింపులు, చట్టవిరుద్ధమైన అరెస్టులు జరుగుతున్నాయంటూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ‘‘పోలీసు విభాగంలో కొందరితో అధికార పార్టీ నాయకులు కుమ్మక్కయ్యారు. ప్రాథమిక హక్కుల పునరుద్ధరణ పరిరక్షణ కోసం విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రంలో చట్టవిరుద్ధమైన అరెస్టులు, ప్రజల అక్రమ నిర్బంధాలు పెరిగి పోయాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19ను యధేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. మాట్లాడే హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛను అధికార పార్టీ హరించివేస్తోంది. సోషల్ మీడియా వేదికగా పోలీసులు అత్యంత అమానవీయ, అనాగరిక ధోరణితో వ్యవహరిస్తున్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం, నాయుడుపాలెం గ్రామంలోని వడ్డెల సందీప్ కుమార్ మరియు తొట్టెంపూడి చంద్రశేఖర్‌లను 2020 జూలై 16న అరెస్టు చేశారు. మంత్రి బాలినేనిపై ఇదే వార్తలు, తమిళనాడు అంతటా తమిళ మీడియాలో ప్రసారం అయ్యాయి. ప్రచురించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ నుండి భారీ మొత్తంలో నగదును అక్రమంగా రవాణా చేస్తున్న నిందితులపై సమగ్ర విచారణ చేయడం, వారిపై కఠినమైన చర్యలు తీసుకోడానికి బదులుగా సందీప్, చంద్రశేఖర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఇద్దరిని అరెస్ట్ చేసిన ఒంగోలు గ్రామీణ పోలీసులు, ఆ తర్వాత వారిని ఒక పోలీస్ స్టేషన్ నుండి మరొక పోలీస్ స్టేషన్‌కు, 3 స్టేషన్లు తిప్పుతూ దారుణంగా కొట్టడమే కాకుండా భౌతికంగా హింసించారు. మన రాజ్యాంగం కేవలం న్యాయవాదుల పత్రం కాదు, అదొక జీవన నౌక(లైఫ్ వెహికల్), దాని ఆత్మ ప్రతినిత్యం సంజీవనని అంబేద్కర్ చెప్పిన సూక్తిని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ప్రస్తుతం మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో, బాబా సాహెబ్ అంబేద్కర్ పేర్కొన్నరాజ్యాంగ 'ఆత్మ' ప్రత్యక్ష, పరోక్ష దాడికి గురైంది. చట్ట ప్రకారం సత్వర న్యాయం అందించేలా మీ గురుతర జోక్యం తక్షణ అవసరం. ఈ అంశంలో మీ గురుతర జోక్యం మన ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే కాకుండా, సమాజంలోని వ్యవస్థల విలువలపై యువతరంలో విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.’’ అంటూ లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - 2020-07-18T20:01:35+05:30 IST