గవర్నర్తో టీడీపీ నేతల భేటీ
ABN , First Publish Date - 2020-03-04T17:09:36+05:30 IST
గవర్నర్తో టీడీపీ నేతల భేటీ
విజయవాడ: రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, బచ్చుల అర్జునుడు, బుద్దా వెంకన్న బుధవారం ఉదయం భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని గవర్నర్కు నేతలు ఫిర్యాదు చేశారు. బీసీలకు అమలులో ఉన్న 34 శాతం రిజర్వేషన్ల పరిరక్షణకు సుప్రీంకోర్టులో ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని టీడీపీ నేతలు కోరుతున్నారు.