గవర్నర్ను కలిసిన సీఎం జగన్
ABN , First Publish Date - 2020-06-22T22:27:41+05:30 IST
గవర్నర్ను కలిసిన సీఎం జగన్
![గవర్నర్ను కలిసిన సీఎం జగన్](https://media.andhrajyothy.com/appimg/galleries/2020062204563230/06222020165850n92.gif)
అమరావతి: రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ను ముఖ్యమంత్రి జగన్ కలుసుకున్నారు. మండలి జరిగిన తీరు, బిల్లుల పెండింగ్పై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే బడ్జెట్ సమావేశాలపై చర్చ జరుగనుంది. ఇద్దరు మంత్రులు రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనందున కాబినెట్లో మార్పులపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కోవిడ్ కేస్లు... నివారణకు తీసుకుంటున్న చర్యలను గవర్నర్కు సీఎం జగన్ వివరించనున్నారు.