3 బిల్లులకు గవర్నర్‌ ఆమోదం

ABN , First Publish Date - 2020-12-30T08:46:27+05:30 IST

గత అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం పొందిన మూడు బిల్లులకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపారు.

3 బిల్లులకు గవర్నర్‌ ఆమోదం

అమరావతి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): గత అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం పొందిన మూడు బిల్లులకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదం తెలిపారు. మంగళవారం ఈ మేరకు న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ట్యాక్స్‌ ఆన్‌ ప్రొఫెషన్స్‌, ట్రేడ్స్‌, సేలింగ్‌, ఎంప్లాయిమెంట్‌(సవరణ) యాక్ట్‌-2020, ఆంధ్రప్రదేశ్‌ వాల్యూ యాడెడ్‌ ట్యాక్స్‌(మూడవ సవరణ) యాక్ట్‌-2020, ఆంధ్రప్రదేశ్‌ వాల్యూ యాడెడ్‌ ట్యాక్స్‌(రెండవ సవరణ) చట్టం-2020లకు గవర్నర్‌ ఆమోద ముద్రపడడంతో వాటిని గజిట్‌లో ప్రచురిస్తూ న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - 2020-12-30T08:46:27+05:30 IST