ఎక్కువ పరిశ్రమలొచ్చేలా చర్యలు

ABN , First Publish Date - 2020-10-01T07:51:57+05:30 IST

పరిశ్రమలను ఎక్కువగా తీసుకొచ్చే లా జిల్లాల్లో అవసరమైతే ఉద్యోగులను పెంచాలని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నిర్దేశించారు...

ఎక్కువ పరిశ్రమలొచ్చేలా చర్యలు

  • ప్రతి నియోజకవర్గంలో ఎంఎ్‌సఎంఈ పార్కు: మంత్రి గౌతమ్‌రెడ్డి


అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): పరిశ్రమలను ఎక్కువగా తీసుకొచ్చే లా జిల్లాల్లో అవసరమైతే ఉద్యోగులను పెంచాలని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి నిర్దేశించారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఒక ఎంఎ్‌సఎంఈ పా ర్కు అభివృద్ధి చే సేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బుధవారమిక్కడ పరిశ్రమలు, ఐటీ, ఎలక్ర్టానిక్స్‌ శాఖల పనితీరుపై మేకపాటి గౌతమ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సపై పరిశ్రమల శాఖ అధికారులతో చర్చించారు. నూతన పారిశ్రామిక విధానంతో ఎంఎ్‌సఎంఈలకు ఎక్కువ మేలు జరుగుతుందని మంత్రి వివరించారు. మరోవైపు ఎల్జీ తరహా ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే అప్రమత్తం చేసి, సందేశాలు పంపే టెక్నాలజీ వ్యవస్థపై ఎవెనియోన్‌ కంపెనీ ప్రతినిఽధులు మంత్రికి వివరాలు అందించారు.


Updated Date - 2020-10-01T07:51:57+05:30 IST