అది ఒక్క జగన్‌కే చెల్లింది: గోరంట్ల

ABN , First Publish Date - 2020-04-05T22:57:51+05:30 IST

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు.

అది ఒక్క జగన్‌కే చెల్లింది: గోరంట్ల

గుంటూరు: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇచ్చిన నిధులతో పాటు రాష్ట్రాలు తమ వాటా ఇస్తుంటే ఏపీలో మాత్రం నిధుల్ని జేబుల్లో వేసుకుంటున్నారని గోరంట్ల విమర్శించారు. వైసీపీ నేతలు రోగ రాజకీయాలకు పాల్పడుతున్నారని, కేంద్రం 3 నెలల రేషన్‌ ఒకేసారి ఇవ్వమని చెప్పిందని ఆయన గుర్తు చేశారు. జగన్‌ వివిధ దఫాలుగా ఇస్తూ పేదల కడుపు కొడుతున్నారని గోరంట్ల మండిపడ్డారు. వైఫల్యాలను మీడియా ఎక్కడ ప్రశ్నిస్తుందోనన్న భయంతో రికార్డెడ్ ప్రెస్‌మీట్ పెట్టడం ఒక్క జగన్‌కే చెల్లిందని గోరంట్ల ఎద్దేవా చేశారు.

Updated Date - 2020-04-05T22:57:51+05:30 IST