మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం

ABN , First Publish Date - 2020-02-28T13:41:19+05:30 IST

రాజమండ్రి: రంపచోడవరం మండలం బూసిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. ఆశ్రమ పాఠశాలలో 9తరగతి చదువుతున్న మైనర్ బాలికపై ముగ్గురు

మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం

రాజమండ్రి: రంపచోడవరం మండలం బూసిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. ఆశ్రమ పాఠశాలలో 9తరగతి చదువుతున్న మైనర్ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆశ్రమ పాఠశాలకు చెందిన ప్రధానోపాధ్యాయురాలి ఫిర్యాదు మేరకు రంపచోడవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బూసిగూడెం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఈ దారుణానికి పాల్పడినట్టు ప్రధానోపాధ్యాయురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులపై ఫోక్స్ , దిశా చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌చార్జి డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు.

Updated Date - 2020-02-28T13:41:19+05:30 IST