28 నుంచి చిన్న రైతులకు ఉచిత బోర్లు
ABN , First Publish Date - 2020-09-23T09:43:38+05:30 IST
28 నుంచి చిన్న రైతులకు ఉచిత బోర్లు
అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతుల పొలాల్లో ఉచితంగా బోర్లు వేసేందుకు ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలు చేపట్టింది. వైఎస్సార్ జల కళ పథకం ద్వారా బోర్లు వేసే కార్యక్రమాన్ని ఈనెల 28న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. అర్హులైన రైతులు ఆన్లైన్లో, లేదా గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.