తూర్పు గోదావరి జిల్లాలో దారుణం..

ABN , First Publish Date - 2020-04-29T04:01:20+05:30 IST

కె.గంగవరం మండలం మసకపల్లిలో దారుణం జరిగింది. మెడిశెట్టి ఇజ్రాయిల్ అనే వ్యక్తిపై నలుగురు వ్యక్తులు కత్తులతో..

తూర్పు గోదావరి జిల్లాలో దారుణం..

రాజమండ్రి: కె.గంగవరం మండలం మసకపల్లిలో దారుణం జరిగింది. మెడిశెట్టి ఇజ్రాయిల్ అనే వ్యక్తిపై నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఇజ్రాయిల్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడ ఆస్పత్రికి తరలించారు. రెండు నెలల క్రితం వైవీ సుబ్బారెడ్డి పర్యటనలో మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుపై ఇజ్రాయిల్‌ చెప్పుతో దాడి చేసినట్లు సమాచారం.  ఇందుకు ప్రతిగా ఇజ్రాయిల్‌పై దాడి జరిగి ఉండొచ్చని స్థానికులు అంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2020-04-29T04:01:20+05:30 IST