వైసీపీ అవినీతి బురదను టీడీపీకి అంటిస్తున్నారు: పుల్లారావు

ABN , First Publish Date - 2020-06-16T18:03:15+05:30 IST

వైసీపీ అవినీతి బురదను టీడీపీకి అంటించాలని చూస్తున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అక్రమ కేసులు, అరెస్ట్‌లతో టీడీపీ నేతలపై వైసీపీ

వైసీపీ అవినీతి బురదను టీడీపీకి అంటిస్తున్నారు: పుల్లారావు

అమరావతి: వైసీపీ అవినీతి బురదను టీడీపీకి అంటించాలని చూస్తున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అక్రమ కేసులు, అరెస్ట్‌లతో టీడీపీ నేతలపై వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. అచ్చెన్నాయుడు పట్ల వైసీపీ ప్రభుత్వం అత్యంత దారుణంగా ప్రవర్తించిందని విమర్శించారు. అధికారం శాశ్వతం కాదన్నది వైసీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలన్నారు. రెండేళ్ల తర్వాత ఉంటారో లేదో వంతపాడే మంత్రులు తెలుసుకోవాలని సూచించారు. జేసీ బ్రదర్స్‌పై అక్రమంగా 21 కేసులు పెట్టారని చెప్పారు.

Updated Date - 2020-06-16T18:03:15+05:30 IST