సీమకు అన్యాయంపై నోరు విప్పాలి: అఖిలప్రియ
ABN , First Publish Date - 2020-08-08T08:51:29+05:30 IST
రాయలసీమకు జరుగుతున్న అన్యాయం గురించి సీమలోని ప్రతి వైసీపీ నాయకుడు నోరు విప్పాలని
అమరావతి, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): రాయలసీమకు జరుగుతున్న అన్యాయం గురించి సీమలోని ప్రతి వైసీపీ నాయకుడు నోరు విప్పాలని మాజీ మంత్రి అఖిలప్రియ శుక్రవారం డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి సీమలోని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని నిలిదీయాలని సూచించారు. కర్నూలుకు హైకోర్టు ఇస్తున్నారంటే పార్టీలకు అతీతంగా స్వాగతిస్తామని, కానీ హైకోర్టుతోపాటు ఆగిపోయిన ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఎయిర్పోర్టులు పూర్తి చేయాలని కోరారు.