రాయితీ విత్తనాల కోసం రైతుల ఎదురుచూపు
ABN , First Publish Date - 2020-12-20T09:15:08+05:30 IST
నివర్ తుఫాన్కు పైర్లు దెబ్బతినడంతో తిరిగి పంటలు వేసుకునేందుకు రాయితీ విత్తనాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. తుఫాన్ కారణంగా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో ఎక్కువగా రబీ పైర్లు దెబ్బతిన్నాయి

అమరావతి, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): నివర్ తుఫాన్కు పైర్లు దెబ్బతినడంతో తిరిగి పంటలు వేసుకునేందుకు రాయితీ విత్తనాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. తుఫాన్ కారణంగా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో ఎక్కువగా రబీ పైర్లు దెబ్బతిన్నాయి. ఆ జిల్లాల రైతులకు డిసెంబరు రెండో వారం నుంచి రాయితీ విత్తనాలివ్వాలని అధికారులను మంత్రి కన్నబాబు ఆదేశించారు. ఇప్పటికే రైతుభరోసా కేంద్రాల్లో 6వేల మందికిపైగా తుఫాన్ బాధిత రైతులు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరికే 4వేల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేయాల్సి ఉండగా, ప్రకాశం జిల్లాలో 151 మందికి మాత్రమే విత్తనాలు అందాయి.