292వ రోజుకి చేరిన అమరావతి రైతుల నిరసనలు

ABN , First Publish Date - 2020-10-04T13:55:43+05:30 IST

ఏపీ రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు, రైతుకూలీలు చేపట్టిన ఆందోళనలు..

292వ రోజుకి చేరిన అమరావతి రైతుల నిరసనలు

అమరావతి: ఏపీ రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు, రైతుకూలీలు చేపట్టిన ఆందోళనలు ఆదివారం నాటికి 292వ రోజుకి చేరాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, నీరుకొండ, అనంతవరం, పెదపరిమి, ఐనవోలు, నెక్కల్లు, తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించేవరకు ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ ఉద్యమం కొనసాగిస్తున్నామని చెప్పారు.

Updated Date - 2020-10-04T13:55:43+05:30 IST