మొక్కజొన్న రైతుల ధర్నా
ABN , First Publish Date - 2020-12-07T21:26:47+05:30 IST
మొక్కజొన్న రైతులు రోడ్డెక్కారు. నందికొట్కూరు - మిడ్తూర్ రహదారిలో ఉన్న గోడౌన్స్ ఎదుట మొక్కజొన్న రైతులు ధర్నాకు దిగారు.

కర్నూలు: మొక్కజొన్న రైతులు రోడ్డెక్కారు. నందికొట్కూరు - మిడ్తూర్ రహదారిలో ఉన్న గోడౌన్స్ ఎదుట మొక్కజొన్న రైతులు ధర్నాకు దిగారు. గత మూడు రోజుల నుంచి ఆన్లోడ్ చేయకపోవడంతో మొక్కజొన్న సంచులతో వాహనాలు నిలిచిపోయాయి. మిడుతూరు రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో మొక్కజొన్న రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గత మూడు రోజుల నుంచి ఆన్లోడ్ చేయకపోవడంతో ఇబ్బంది పడతున్నామని.. ప్రభుత్వం సరుకును వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు.