అమరావతి ఉద్యమంలో మరో రైతు మృతి

ABN , First Publish Date - 2020-10-07T21:18:07+05:30 IST

రాజధాని అమరావతి ఉద్యమంలో మరో రైతు గుండె ఆగింది. ఇప్పటికే అనేక మంది రైతులు తమ ప్రాణాలు వదిలారు. తాజాగా అమరావతి తరలిపోతుందన్న

అమరావతి ఉద్యమంలో మరో రైతు మృతి

అమరావతి: రాజధాని అమరావతి ఉద్యమంలో మరో రైతు గుండె ఆగింది. ఇప్పటికే అనేక మంది రైతులు తమ ప్రాణాలు వదిలారు. తాజాగా అమరావతి తరలిపోతుందన్న మనస్తాపంతో నవులూరు గ్రామానికి చెందిన రైతు నాగమల్లేశ్వరరావు మృతిచెందారు. రాజధాని కోసం నాగమల్లేశ్వరరావు.. 2 ఎకరాల 30 సెంట్ల భూమి ఇచ్చారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ గత కొద్ది రోజులుగా రైతులంతా ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే.

Updated Date - 2020-10-07T21:18:07+05:30 IST