మాజీమంత్రి మాణిక్యాలరావు అంత్యక్రియలకు ఏర్పాట్లు
ABN , First Publish Date - 2020-08-02T02:42:34+05:30 IST
మాజీమంత్రి పైడికొండల మాణిక్యాలరావు పార్థివదేహం తాడేపల్లిగూడేనికి తరలించారు. తాడేపల్లిగూడెంలోని..

ఏలూరు: మాజీమంత్రి పైడికొండల మాణిక్యాలరావు పార్థివదేహం తాడేపల్లిగూడేనికి తరలించారు. తాడేపల్లిగూడెంలోని కొండలమ్మ గుడి రోడ్డులో మామిడాల చెరువు వద్ద శ్మశానవాటికలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కేవలం ఇరవై మందికి మాత్రమే అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా మాణిక్యాలరావు కరోనా మరణించిన విషయం తెలిసిందే.