వాళ్లకు నోటీసులు లేవు.. ఇదేనా జగన్నీతి: జవహర్
ABN , First Publish Date - 2020-10-15T00:23:08+05:30 IST
చంద్రబాబు నివాసానికి నోటీసులు పంపడాన్ని మాజీ మంత్రి జవహర్ తప్పుబట్టారు. అమరావతిలో...

రాజమండ్రి: చంద్రబాబు నివాసానికి నోటీసులు పంపడాన్ని మాజీ మంత్రి జవహర్ తప్పుబట్టారు. అమరావతిలో చంద్రబాబు ఉంటున్న ఇంట్లోకి చుక్క నీరు రాకపోయినా ఇంటిని ఖాళీ చేయాలని వారానికోసారి నోటీసు పంపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పేదల ఇళ్ల కోసం రూ.వందల కోట్లు పెట్టి కొన్న స్థలాలు నీట మునిగితే కొన్న అధికారులకు, కొనిపించిన నేతలకు ఏ నోటీసులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా జగన్నీతి అంటే అని జవహర్ ఎద్దేవా చేశారు.