ప్రతి దేవాలయం విధిగా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి: మంత్రి వెల్లంపల్లి
ABN , First Publish Date - 2020-06-03T21:27:11+05:30 IST
దేవాలయాల భూముల పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. దేవాలయ భూములు విషయంలో న్యాయ సమస్యల పరిష్కారానికి..
అమరావతి: దేవాలయాల భూముల పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. దేవాలయ భూములు విషయంలో న్యాయ సమస్యల పరిష్కారానికి.. కమిషన్ కార్యాలయం నుంచి వచ్చే సూచనలు పాటించాలన్నారు. ప్రతి దేవాలయం విధిగా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని సూచించారు. ఆన్లైన్ సేవలు, డిజిటల్ లావాదేవీలపై శ్రద్ధ చూపించాలని వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదేశించారు.