రాష్ట్ర పారిశ్రామిక ప్రోత్సాహక అధికారులుగా ఇంజినీరింగ్ అసిస్టెంట్లు..

ABN , First Publish Date - 2020-11-13T20:04:10+05:30 IST

అమరావతి: రాష్ట్ర పారిశ్రామిక ప్రోత్సాహక అధికారులుగా... గ్రామ, వార్డు సచివాలయాల ఇంజినీరింగ్ అసిస్టెంట్లను ప్రభుత్వం వినియోగించుకోనుంది.

రాష్ట్ర పారిశ్రామిక ప్రోత్సాహక అధికారులుగా ఇంజినీరింగ్ అసిస్టెంట్లు..

అమరావతి: రాష్ట్ర పారిశ్రామిక ప్రోత్సాహక అధికారులుగా... గ్రామ, వార్డు సచివాలయాల ఇంజినీరింగ్ అసిస్టెంట్లను ప్రభుత్వం వినియోగించుకోనుంది. పరిశ్రమల సమగ్ర సర్వే కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లోని.. ఇంజినీరింగ్ సహాయకులను వినియోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. పరిశ్రమల్లోని వేర్వేరు అంశాలను నమోదు చేసేందుకు.. వీరి సేవలను వినియోగించుకునేలా పరిశ్రమలశాఖకు అనుమతి మంజూరు చేసింది. పరిశ్రమల్లో విద్యుత్ వినియోగం, రెవెన్యూ, ఉపాధి కల్పన తదితర అంశాలను.. మొబైల్ యాప్‌లో నమోదు చేయాలని ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పథకాలపై కూడా అవగాహన కల్పించేలా.. సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Updated Date - 2020-11-13T20:04:10+05:30 IST