రేపు రాష్ట్రంలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
ABN , First Publish Date - 2020-06-18T16:48:43+05:30 IST
అమరావతి: రేపు రాష్ట్రంలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఎన్నికల బరిలో వైసీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి ఒకరు నిలవనున్నారు.
అమరావతి: రేపు రాష్ట్రంలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యసభ ఎన్నికల బరిలో వైసీపీ నుంచి నలుగురు, టీడీపీ నుంచి ఒకరు నిలవనున్నారు. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఓటు ఎలా వేయాలో శాసనసభ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చూపించనున్నారు. వైసీపీ నుంచి బరిలో ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి, అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని.. టీడీపీ నుంచి పోటీలో వర్ల రామయ్య ఉన్నారు.