జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లకు అర్హతలు ప్రకటించిన ఈసీ
ABN , First Publish Date - 2020-03-09T16:09:49+05:30 IST
విజయవాడ: జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు సమర్పించేందుకు ఈసీ అర్హతలు ప్రకటించింది. 1994, మే 30 నాటికి ముగ్గురు పిల్లలు ఉన్నా పోటీకి అర్హులేనని ఈసీ వెల్లడించింది.
విజయవాడ: జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు సమర్పించేందుకు ఈసీ అర్హతలు ప్రకటించింది. 1994, మే 30 నాటికి ముగ్గురు పిల్లలు ఉన్నా పోటీకి అర్హులేనని ఈసీ వెల్లడించింది. 1995 తర్వాత రెండో సంతానంగా కవలలు పుట్టడంతో.. ముగ్గురు ఉన్నా పోటీకి అర్హులని తెలిపింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసేవారికి 21 ఏళ్ల వయసు తప్పనిసరి అని ఈసీ పేర్కొంది. ఎంపీటీసీకి పోటీ చేసే వారు ఆయా మండల పరిధిలోను, జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసే వారు జిల్లా పరిధిలో ఓటు హక్కు కల్గి ఉండాలి. వారిని బలపరిచే వారు సైతం జిల్లాలో ఏదో ఒక స్థానం పరిధిలో ఓటరై ఉండాలని ఈసీ స్పష్టం చేసింది.