డీమార్ట్ అధినేత 155 కోట్ల విరాళం
ABN , First Publish Date - 2020-04-05T09:24:27+05:30 IST
కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు మద్దతుగా డీ మార్ట్ అధినేత రాధాకృష్ణన్ దమానీ రూ. 155 కోట్ల విరాళం ప్రకటించారు. వీటిలో రూ. 100 కోట్లు పీఎం కేర్స్ ఫండ్కు అందజేశారు.

- పీఎం కేర్స్ ఫండ్కు రూ. 100 కోట్లు
- తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 5 కోట్లు
- అదానీ గ్రూప్ రూ. 100 కోట్లు విరాళం
- రూ. 35 కోట్లు ఇచ్చిన సీకే బిర్లా గ్రూప్
- నెస్లే ఇండియా రూ. 15 కోట్లు
- సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ 5.65 కోట్లు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు మద్దతుగా డీ మార్ట్ అధినేత రాధాకృష్ణన్ దమానీ రూ. 155 కోట్ల విరాళం ప్రకటించారు. వీటిలో రూ. 100 కోట్లు పీఎం కేర్స్ ఫండ్కు అందజేశారు. మిగతా రూ. 55 కోట్లను 11 రాష్ట్రాలకు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో తెలంగాణకు రూ. 5 కోట్లు, ఏపీకి రూ. 5 కోట్లు ఇవ్వనున్నారు. అదానీ గ్రూప్ రూ. 100 కోట్ల విరాళం పీఎం కేర్స్ ఫండ్కు అందజేస్తామని ప్రకటించించిచచచచిచచచచింది. సేవా కార్యక్రమాల కోసం మరో రూ. 4 కోట్లు ఇస్తామని, తమ సంస్థ ఉద్యోగులు మరో రూ. 4 కోట్లు ఇవ్వనున్నారని చైర్మన్ గౌతమ్ అదానీ చెప్పారు. సీకే బిర్లా గ్రూప్ రూ. 35 కోట్ల విరాళం ప్రకటించింది. రూ. 25 కోట్లను పీఎం కేర్స్ ఫండ్కు, మిగతా రూ. 10 కోట్లు వైద్య పరికరాలు, మాస్కులు, పీపీఈలు కొనడానికి రాష్ట్రాలకు అందజేస్తామని పేర్కొంది. సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ పీఎం కేర్స్ ఫండ్కు రూ. 5.65 కోట్లు విరాళం ఇచ్చింది. నెస్లే ఇండియా రూ. 15 కోట్ల విరాళం ప్రకటించింది. అపర్ణ కన్స్ట్రక్షన్స్ రూ. 5 కోట్ల విరాళం ఇచ్చింది.