తిరుపతి: దినేష్ హత్య కేసులో నిందితుల అరెస్ట్
ABN , First Publish Date - 2020-09-22T19:27:29+05:30 IST
తిరుపతి: తిరుపతిలో ఈ నెల 20న జరిగిన దినేష్ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
తిరుపతి: తిరుపతిలో ఈ నెల 20న జరిగిన దినేష్ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతికి చెందిన వినయ్ సహా సాయి కృష్ణ, శీను రెడ్డి, గౌతమ్, సురేష్లను తిరుపతి పశ్చిమ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి వివరించారు. పాత కక్షల నేపథ్యంలో తన బాబాయిని చంపారనే పగతో... దినేష్ని వినయ్ గ్యాంగ్ హత్య చేసింది. హత్యానంతరం దామినేడు మీదుగా పారిపోతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. యువతను చెడు దారి పట్టించే గ్యాంగుల ఆధిపత్య పోరుతో 2017 నుంచి మూడు హత్యలు జరిగాయన్నారు. హత్యలు చేసే వారిని నగర బహిష్కరణ చేస్తామని అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి తెలిపారు.ఇకపై ఇలాంటివి జరిగితే తల్లిదండ్రులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.