‘మర్కజ్‌’కు వెళ్లలేదు!

ABN , First Publish Date - 2020-04-01T08:48:13+05:30 IST

ఢిల్లీలో జరిగిన మర్కజ్‌ నిజాముద్దీన్‌ సమావేశాల్లో తాను పాల్గొనలేదని ఉప ముఖ్యమంత్రి అంజద్‌ బాషా స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ప్రచారమైన వార్తల్లో నిజం లేదని...

‘మర్కజ్‌’కు వెళ్లలేదు!

  • లాయర్లతో మాట్లాడేందుకు నెల కిందట ఢిల్లీకి!
  • ఉప ముఖ్యమంత్రి అంజద్‌ బాషా స్పష్టీకరణ

కడప, మార్చి 31 (ఆంధ్రజ్యోతి):  ఢిల్లీలో జరిగిన మర్కజ్‌ నిజాముద్దీన్‌ సమావేశాల్లో తాను పాల్గొనలేదని ఉప ముఖ్యమంత్రి అంజద్‌ బాషా స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ప్రచారమైన వార్తల్లో నిజం లేదని ఆయన తెలిపారు. ‘‘మార్చి 2వ తేదీన ఢిల్లీకి వెళ్లాను. ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టు న్యాయవాదులను కలిశాను. మర్కజ్‌కు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న దర్గాకు వెళ్లి ప్రార్థనలు చేశాను’’ అని తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 15, 16వ తేదీల్లో మర్కజ్‌ సమావేశాల్లో పాల్గొన్నారని... తాను 2వ తేదీన ఢిల్లీకి వెళ్లి మరుసటి రోజునే తిరిగి వచ్చానని చెప్పారు. 4వ తేదీన క్యాబినెట్‌ సమావేశంలో పాల్గొన్నానని... 5వ తేదీ నుంచి కడపలోనే ఉన్నానని అంజద్‌ బాషా ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు.


Updated Date - 2020-04-01T08:48:13+05:30 IST