ఢాకాలో చిక్కుకున్న తెలుగు విద్యార్థినులు

ABN , First Publish Date - 2020-05-09T23:44:30+05:30 IST

బంగ్లాదేశ్‌లోని ఢాకాలో చిక్కుకుని తెలుగు విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో అక్కడ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. విద్యార్థినులు ఉంటున్న

ఢాకాలో చిక్కుకున్న తెలుగు విద్యార్థినులు

అమరావతి: బంగ్లాదేశ్‌లోని ఢాకాలో చిక్కుకుని తెలుగు విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో అక్కడ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. విద్యార్థినులు ఉంటున్న హాస్టళ్లలో భోజనం లేక పస్తులు ఉంటున్నారు. అంతేకాకుండా వారు ఉండే సమీపంలోనే కోవిడ్ చికిత్స ఆస్పత్రి ఉండటంతో యువతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, భారతీయ విద్యార్థులను ఇండియాకు పంపిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 14వ తేదీన ప్రయాణానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. తమ విద్యార్థులను పంపాలని తమిళనాడు నుంచి మాత్రమే ప్రతిపాదన వచ్చిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి స్వరాష్ట్రానికి వచ్చేలా చూడాలని యువతులు విజ్ఞప్తి చేశారు. అక్కడ ఎటువంటి సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ విద్యార్థినులు వీడియో సందేశం పంపారు.

Updated Date - 2020-05-09T23:44:30+05:30 IST