అధికారాన్నంతా దీక్షలు విఫలం చేయడానికే వినియోగిస్తున్నారు: దేవినేని ఉమ
ABN , First Publish Date - 2020-06-26T19:46:58+05:30 IST
అమరావతి: అధికారాన్నంతా అమరావతి దీక్షలు విఫలం చేయడానికి.. రైతుల నిరసనలను అడ్డుకోవడానికి వినియోగిస్తున్నారని..
![అధికారాన్నంతా దీక్షలు విఫలం చేయడానికే వినియోగిస్తున్నారు: దేవినేని ఉమ](https://media.andhrajyothy.com/appimg/galleries/202006260215399/06262020141646n54.jpg)
అమరావతి: అధికారాన్నంతా అమరావతి దీక్షలు విఫలం చేయడానికి.. రైతుల నిరసనలను అడ్డుకోవడానికి వినియోగిస్తున్నారని ట్విట్టర్ వేదికగా దేవినేని ఉమ మండిపడ్డారు. కరోనా నుంచి ప్రజలను రక్షించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో జగన్ చెప్పాలని ప్రశ్నించారు.
‘‘కరోనా కేసులు పదివేలు దాటాయి. కొవిడ్ నిబంధనలను ప్రతిపక్షాలపై కేసులు పెట్టి రాజకీయ కక్ష తీర్చుకోవడానికి, గిట్టుబాటు ధర లేని రైతుల నిరసనను అడ్డుకోవడానికి అమరావతి దీక్షలు విఫలం చేయడానికి వినియోగిస్తున్నారే కానీ ప్రజలను కరోనా నుంచి రక్షించడానికి ఏంజాగ్రత్తలు తీసుకున్నారో చెప్పండి జగన్ గారు’’ అని ఉమ ట్వీట్లో ప్రశ్నించారు.