ప్రజలు అడుగుతున్నారు.. సమాధానం చెప్పండి జగన్గారూ..: దేవినేని ఉమ
ABN , First Publish Date - 2020-05-30T16:07:21+05:30 IST
అమరావతి: ఏడాది పాలనలో సీఎం జగన్ 87 వేల కోట్ల అప్పు చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
అమరావతి: ఏడాది పాలనలో సీఎం జగన్ 87 వేల కోట్ల అప్పు చేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. బడ్జెట్ సొమ్ములు ఏమయ్యాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారని.. సమాధానం చెప్పాలని జగన్ను కోరారు. ‘‘మీ ఏడాదిపాలనలో 87 వేల కోట్ల అప్పు... రెవెన్యూ లోటు70 వేల కోట్లు. కట్టిన ఇళ్లు - సున్నా, వచ్చిన పరిశ్రమలు - సున్నా. ప్రజా రాజధానిని ఆపేశారు. పోలవరం, సాగునీటి ప్రాజెక్టులు పండబెట్టేశారు. బడ్జెట్ సొమ్ములు ఏమయ్యాయని ప్రజలు అడుగుతున్నారు సమాధానం చెప్పండి జగన్ గారూ’’ అని దేవినేని ఉమ ట్వీట్లో కోరారు.