ధర తక్కువ ఇచ్చినా రైతులకు దళారులే దిక్కు: దేవినేని ఉమ
ABN , First Publish Date - 2020-12-13T15:13:14+05:30 IST
అమరావతి: ధాన్యం రైతులు ప్రభుత్వ నిబంధనల కారణంగా బేజారవుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

అమరావతి: ధాన్యం రైతులు ప్రభుత్వ నిబంధనల కారణంగా బేజారవుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ధర తక్కువ ఇచ్చినా.. రైతులకు దళారులే దిక్కవుతున్నారని తెలిపారు. ‘‘ప్రభుత్వ నిబంధనలతో బేజారవుతున్న ధాన్యం రైతులు, కొనేవారి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూపు, ధర తక్కువ ఇచ్చినా రైతులకు దళారులే దిక్కు, సొమ్ము చేసుకుంటున్న దళారులు. నిబంధనల పేరుతో ఎక్కడి ధాన్యం అక్కడే పెట్టి రైతుల వెన్ను విరుస్తున్న మీ విధానాలపై ఏం సమాధానం చెప్తారు?’’ అని దేవినేని ఉమ ప్రశ్నించారు.