విజయవాడకు దగ్గరలో 30వేల ఎకరాలు తీసుకోండి: దేవినేని ఉమ
ABN , First Publish Date - 2020-08-06T19:45:42+05:30 IST
అమరావతి: రాజధాని అనేది రాష్ట్రం మధ్యలో ఉండాలని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
అమరావతి: రాజధాని అనేది రాష్ట్రం మధ్యలో ఉండాలని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. నీళ్లు, ప్రయాణ సౌకర్యం తదితర అవసరాలకు అందుబాటులో ఉండాలన్నారు. ‘‘రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలి. నీళ్లు, ప్రయాణ సౌకర్యం ఉండాలి. విజయవాడ దగ్గరలో 30వేల ఎకరాలు తీసుకోండి. మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామన్నారు. చంద్రబాబు చేసిన ప్రజా రాజధాని అమరావతి ఇదేకదా? టీడీపీ ప్రజా పోరాటం, న్యాయపోరాటం కొనసాగిస్తుంది. మాటతప్పింది, మడమతిప్పింది మీరే కదా’’ అంటూ జగన్ని ఉద్దేశించి ఉమ ట్వీట్ చేశారు.