రాజధాని రైతులకు మద్దతుగా దేవినేని ఉమ నిరాహార దీక్ష

ABN , First Publish Date - 2020-04-10T19:40:34+05:30 IST

అమరావతి: రాజధాని రైతుల దీక్షకు మద్దతుగా నేడు మాజీ మంత్రి దేవినేని ఉమ కూడా నిరాహార దీక్షకు కూర్చున్నారు.

రాజధాని రైతులకు మద్దతుగా దేవినేని ఉమ నిరాహార దీక్ష

అమరావతి: రాజధాని రైతుల దీక్షకు మద్దతుగా నేడు మాజీ మంత్రి దేవినేని ఉమ కూడా నిరాహార దీక్షకు కూర్చున్నారు. గొల్లపూడిలోని తన నివాసంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయన దీక్ష చేయనున్నారు. రాజధాని మహిళలు అమరావతిని కొనసాగించాలంటూ చేస్తున్న దీక్షకు సంఘీభావమే తన దీక్ష అని ఉమ తెలిపారు. విదేశాల్లో ఉన్న తెలుగువారు కూడా రాజధాని మహిళల దీక్షకు మద్దతు పలుకుతున్న తరుణంలో సీఎం జగన్ స్పందించక పోవడం ఏమిటని దేవినేని ఉమ ప్రశ్నించారు.




Updated Date - 2020-04-10T19:40:34+05:30 IST