ఆన్లైన్లో నిమిషాల్లోనే ఇసుక ఖాళీ: దేవినేని ఉమా
ABN , First Publish Date - 2020-06-07T15:38:39+05:30 IST
ఆన్లైన్లో నిమిషాల్లోనే ఇసుక ఖాళీ అవుతోందని టీడీపీ నేత దేవినేని ఉమా అన్నారు. వైసీపీ నేతల గుప్పెట్లో మాత్రం వేల టన్ను ఇసుక ఉంటోందన్నారు.
విజయవాడ: ఆన్లైన్లో నిమిషాల్లోనే ఇసుక ఖాళీ అవుతోందని టీడీపీ నేత దేవినేని ఉమా అన్నారు. వైసీపీ నేతల గుప్పెట్లో మాత్రం వేల టన్ను ఇసుక ఉంటోందన్నారు. లక్షల లారీల ఇసుక తరలించినా స్టాక్యార్డ్లో 20వేలు చూపడంలేదని చెప్పారు. లారీలను ఆపిన అధికారులను బెదిరిస్తున్నారని, వైసీపీ నేతల అండర్ కవర్ అవినీతితో, ఇసుక దోపిడీతో రోడ్డునపడ్డ భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు జగన్ సమధానం చెప్పాలన్నారు.