బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు?: దేవినేని ఉమ
ABN , First Publish Date - 2020-12-20T16:40:45+05:30 IST
బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు?: దేవినేని ఉమ

అమరావతి: ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంద్రకీలాద్రిపై వెండిసింహాలు మాయం, హుండీ లెక్కింపులో చేతివాటం, అనుబంధ ఆలయాలలో ఖరీదైన ఆభరణాల చోరీ ఇలా ఎన్ని సంఘటనలు జరుగుతున్నా బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు? అని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. ఆలయాలలో ప్రజాప్రతినిధులు రాజకీయ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇంద్రకీలాద్రి దోపిడీపై ఏం సమాధానం చెప్తారు? అని ప్రశ్నించారు.