జగన్కు శ్రీవారిపై ఆపారమైన భక్తి విశ్వాసం ఉంది: డిప్యూటీ సీఎం
ABN , First Publish Date - 2020-09-22T12:59:59+05:30 IST
శ్రీవారిపై అపారమైన భక్తి విశ్వాసం కలిగిన వ్యక్తి సీయం జగన్ అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలిపారు.
తిరుమల: శ్రీవారిపై అపారమైన భక్తి విశ్వాసం కలిగిన వ్యక్తి సీయం జగన్ అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలిపారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని డిప్యూటీ సీఎం దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ జగన్కు ప్రజలపై విశ్వాసం ఉందని...ప్రజలే దేవుళ్ళుగా భావిస్తారని అన్నారు. ఆయనకు కులం, మతం పట్టింపులు లేవని చెప్పారు. మంత్రి కొడాలి నాని వాఖ్యలు ఆయన వ్యక్తిగతమని స్పష్టం చేశారు. డిక్లరేషన్ అంశం ఇప్పుడు అనవసరమని.. గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి, జగన్ అనేక సార్లు శ్రీవారి దర్శనం కోసం విచ్చేశారని చెప్పుకొచ్చారు. శ్రీవారి భక్తుడు కాబట్టే జగన్ కాలినడకన తిరుమల విచ్చేశారన్నారు. దేశంలో ఎవ్వరూ చేయని సంక్షేమ పథకాలను అమలు చేస్తుండటంతో ప్రతిపక్షాలు కుట్ర చేస్తూన్నాయని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఆరోపించారు.