డుమ్మా కొట్టే టీచర్లకు దండన!
ABN , First Publish Date - 2020-09-19T09:02:59+05:30 IST
సహేతుక కారణం లేకుండా ఇష్టానుసారం స్కూళ్లకు డుమ్మాకొట్టే ఉపాధ్యాయులపై పాఠశాల విద్యాశాఖ కొరడా ఝళిపించనుంది. అనధికారికంగా, ఉద్దేశపూర్వకంగా, లీవు పెట్టకుండానే
తక్షణమే షోకాజ్ నోటీసు జారీ..
పాఠశాల విద్యా కమిషనర్ ఆదేశాలు
అమరావతి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): సహేతుక కారణం లేకుండా ఇష్టానుసారం స్కూళ్లకు డుమ్మాకొట్టే ఉపాధ్యాయులపై పాఠశాల విద్యాశాఖ కొరడా ఝళిపించనుంది. అనధికారికంగా, ఉద్దేశపూర్వకంగా, లీవు పెట్టకుండానే దీర్ఘకాలంపాటు స్కూళ్లకు గైర్హాజరయ్యే టీచర్లపై చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. 30 రోజులకుపైగా అనధికారికంగా గైర్హాజరయ్యే ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిని గుర్తించి తక్షణమే షోకాజ్ నోటీసులు జారీచేయాలని స్పష్టంచేశారు. ఏడాదికాలం డుమ్మా కొట్టిన తర్వాత కూడా రిపోర్టు చేయని టీచర్ల పేర్లను స్థానిక వార్తా పత్రికల్లో ప్రచురించాలని తెలిపారు.
అయినప్పటికీ రిపోర్టు చేయకుంటే వారి పేర్లను గజిట్లో ప్రచురించి, 2017 సెప్టెంబరు 5 నాటి జీవోఎంఎ్స నంబరు 127 ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనధికారికంగా ఒక ఏడాదికి పైగా గైర్హాజరైనా, ఐదేళ్లపాటు నిరంతరంగా విధులకు రాకున్నా లేక సెలవు పెట్టకున్నా, ప్రభుత్వం అనుమతించిన కాలపరిమితికి మించి ఫారిన్ సర్వీ్సలో కొనసాగుతున్నా షోకాజ్ నోటీస్ జారీచేయాలన్నారు. ఈమేరకు రాష్ట్రంలోని ఆర్జేడీలు, డీఈవోలకు సూచనలు చేశారు. ఆయా టీచర్లపై చర్యలు తీసుకోకుంటే వీరిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.