189 మందిలో 158 మంది గుర్తింపు.. మిగిలిన వారెక్కడ?.
ABN , First Publish Date - 2020-04-02T00:12:39+05:30 IST
జిల్లా నుంచి 189 మంది ఢిల్లీ జమాత్ ప్రార్థనలకు వెళ్లి వచ్చారన్న వార్తతో జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకూ 158 మందిని ..

కర్నూలు: జిల్లా నుంచి 189 మంది ఢిల్లీ జమాత్ ప్రార్థనలకు వెళ్లి వచ్చారన్న వార్తతో జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటి వరకూ 158 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించి శాంపిల్స్ను తిరుపతి ల్యాబ్ కు పంపారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకూ ఒక పాజిటివ్ కేసు నమోదు అయింది. ఇంకా 16 మంది కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారు.