పగలు ఎండ.. రాత్రి చలి
ABN , First Publish Date - 2020-12-29T08:11:05+05:30 IST
పగలు ఎండ.. రాత్రి చలి
అమరావతి, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పగలు ఎండ, రాత్రి చలి ప్రభావం చూపుతున్నాయి. గాలిలో తేమ 80శాతం కంటే ఎక్కువ ఉంటోంది. పగలు గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి 1 డిగ్రీ అటూఇటుగా, రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 1-4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7-8 గంటల వరకు చలి, పొగ మంచు ఉంటున్నాయి. సోమవారం రాయలసీమలో అక్కడక్కడ చిరు జల్లులు పడ్డాయి. కాగా, తూర్పుఈశాన్య గాలులతో ఈనెల 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.