మందడంలో సీఆర్డీఏ అధికారుల హల్‌చల్

ABN , First Publish Date - 2020-04-08T19:27:50+05:30 IST

అమరావతి: లాక్‌డౌన్ సమయంలో రాజధాని గ్రామం మందడంలో సీఆర్డీఏ అధికారులు హల్‌చల్ చేశారు.

మందడంలో సీఆర్డీఏ అధికారుల హల్‌చల్

అమరావతి: లాక్‌డౌన్ సమయంలో రాజధాని  గ్రామం మందడంలో సీఆర్డీఏ అధికారులు హల్‌చల్ చేశారు. నిన్న నీరుకొండ, ఐనవోలులో.. నేడు మందడాన్ని సీఆర్డీఏ అధికారులు సందర్శించారు. అధికారిలు రాకతో రైతుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన గెజిట్‌లోని ఆర్5 రెసిడెన్షియల్ జోన్‌పై ప్రజాభిప్రాయ సేకరణకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని అధికారులు చెబుతున్నారు. పేదలకు సెంట్ భూమి పంపిణీపై హైకోర్టు ధర్మాసనం స్టే ఇచ్చిందని రైతులు పేర్కొంటున్నారు. ఈ విషయం తెలిసి కూడా సీఆర్డీఏ అధికారులు రావడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-04-08T19:27:50+05:30 IST