వలస కూలీలను స్వగ్రామాలకు పంపండి: సీపీఎం
ABN , First Publish Date - 2020-04-28T10:24:10+05:30 IST
‘‘రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న వలస కూలీలు గత నెల రోజులుగా నానా ఆగచాట్లు పడుతున్నారు.

అమరావతి, విజయవాడ, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న వలస కూలీలు గత నెల రోజులుగా నానా ఆగచాట్లు పడుతున్నారు. ప్రభుత్వ చర్యలతో వారి అవసరాలు అరకొరగానే తీరుతున్నాయి. వెంటనే వారిని స్వగ్రామాలకు పంపే ఏర్పాట్లు ప్రభుత్వం చేయాలి’’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు డిమాండ్ చేశారు. సోమవారం ఈ మేరకు సీఎంకు లేఖ రాశారు.