20 వేల మందికి భోజనం అందించిన సీపీఎం నేతలు
ABN , First Publish Date - 2020-03-27T17:14:46+05:30 IST
విజయవాడ: లాక్డౌన్తో ఐదు రోజుల నుంచి పనులు లేక పస్తులుంటున్న పేదలు, కూలీలకు సీపీఎం నేతలు భోజన వసతి కల్పించారు.
విజయవాడ: లాక్డౌన్తో ఐదు రోజుల నుంచి పనులు లేక పస్తులుంటున్న పేదలు, కూలీలకు సీపీఎం నేతలు భోజన వసతి కల్పించారు. సింగనగర్ ప్రాంతంలో ఎనిమిది డివిజన్లలో 20 వేల మందికి ఇంటింటికీ వెళ్లి సీపీఎం నేతలు, కార్యకర్తలు ఆహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నేతలు మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి చెందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయన్నారు. ప్రజలకు బాధ్యతలు గుర్తు చేస్తున్న ప్రభుత్వాలు.. వారి బాధ్యతను మరచిపోయాయన్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఇంకా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వెయ్యి రూపాయలు, ఐదు కిలోల బియ్యం ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. రోజూ కూలి పనులు చేసుకునే వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని.. వలంటీర్లు ద్వారా వారికి ఆహార సదుపాయాలు ప్రభుత్వం అందించాలన్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ఈఎంఐలు, డ్వాక్రా వాయిదాలు చెల్లించకుండా మూడు నెలల పాటు వెసులుబాటు కల్పించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు.