ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయండి: రామకృష్ణ
ABN , First Publish Date - 2020-06-21T18:01:02+05:30 IST
రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసి, నాణ్యమైన ఇసుక సరఫరాకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన
![ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయండి: రామకృష్ణ](https://media.andhrajyothy.com/appimg/galleries/2020062112285912/06212020123056n13.jpg)
అమరావతి: రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసి, నాణ్యమైన ఇసుక సరఫరాకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది గడిచినప్పటికీ రాష్ట్రంలో ఇసుక మాఫియా అక్రమాలు ఆగలేదన్నారు. గతంలో ట్రాక్టర్ ఇసుక రూ.1500 ఉంటే ప్రస్తుతం రూ.6 వేలకు పెరిగిందన్నారు. మేలిరకం ఇసుక ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిపోతుందని, దీంతో రాష్ట్రంలో నాసిరకం ఇసుక సరఫరా వల్ల నిర్మాణ దారులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. నాసిరకం ఇసుక సరఫరా జరిగిందని స్వయానా మంత్రి పినిపే విశ్వరూప్.. కలెక్టర్ దృష్టికి తీసుకురాగా నిజమని తేలిందన్నారు. సాక్షాత్తు వినుకొండ వైసీపీ ఎమ్మెల్యేనే ఇసుక అక్రమాలపై గళమెత్తారని గుర్తుచేశారు. ఇప్పటికీ పలు ఇక్కట్లు ఎదుర్కొంటున్న భవన నిర్మాణ కార్మికులకు పనులు కూడా కొరవడే పరిస్థితి ఎదురవుతుందన్నారు. తక్షణమే ఇసుక సరఫరాలో అక్రమాలను అరికట్టాలని ముఖ్యమంత్రిని రామకృష్ణ డిమాండ్ చేశారు.