తిరుపతిలో అమరావతికి మద్దతుగా సీపీఐ నిరసన

ABN , First Publish Date - 2020-10-12T16:57:00+05:30 IST

తిరుపతి: తిరుపతి ఆర్డీవో ఆఫీసు ఎదుట అమరావతికి మద్దతుగా సీపీఐ నిరసన కార్యక్రమం నిర్వహించింది.

తిరుపతిలో అమరావతికి మద్దతుగా సీపీఐ నిరసన

తిరుపతి: తిరుపతి ఆర్డీవో ఆఫీసు ఎదుట అమరావతికి మద్దతుగా సీపీఐ నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా సీపీఐ నేత నారాయణ మాట్లాడుతూ.. రాజధానిని మార్చే ముందు రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే ఆయన నిర్ణయం చెల్లుబాటు అవుతుందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలేవీ జగన్‌ నెరవేర్చలేదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ జగన్‌ నిర్వీర్యం చేస్తున్నారన్నారు. న్యాయస్థానాలు, జడ్జిలపై జగన్‌ చేయిస్తున్న దాడి దారుణమన్నారు. 

Updated Date - 2020-10-12T16:57:00+05:30 IST